ది.05-09-2025న జరిగే గురుపూజోత్సవము నాడు అందించే జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు అర్హులైన అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల ఉపాధ్యాయులు వారు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి, గుంటూరు తెలియజేసినారు. కనీసం పదేళ్ళు సర్వీస్ ఉన్న వారు అర్హులని, నేరారోపణలు, అభియోగాలు ఉన్న వారు అనర్హులని పేర్కొన్నారు. సివిల్, క్రిమినల్ కేసులు లేవని తనిఖీ అధికారుల ధ్రువీకరణ పత్రాన్ని వారి వారి దరఖాస్తుకు జత చేయాలని సూచించారు. మండల విద్యాశాఖాధికారులు, ఉప విద్యాశాఖాధికారులు, ఉప తనిఖీ అధికారి (ఉర్దూ రేంజ్) అధికారుల కార్యాలయాలలో దరఖాస్తులు అందజేయాలని, సదరు దరఖాస్తులు / ప్రతిపాదనలు 2 Sets తేది.26-08-2025 సాయంత్రం 5 గంటల్లోపు సంబంధిత అధికారుల పంపించాలని కోరడమైనది. ద్వారా జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయానికి
నమూనా దరఖాస్తు deogunturblogspot.com website నందు ఉంచడమైనదని తెలియ
జేయడమైనది.